bahubali: 'బాహుబలి'కి మరో గౌరవం.. ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న రమ్యకృష్ణ, శోభు

  • ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2017గా 'బాహుబలి'
  • అవార్డును ప్రకటించిన సీఎన్ఎన్ ఐబీఎన్
  • 'బాహుబలి-3' ఉంటుందని ఎవరూ భావించవద్దన్న శోభు

భారతీయ సినీ చరిత్ర గతిని మార్చిన 'బాహుబలి'కి మరో గౌరవం దక్కింది. సీఎన్ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2017గా ఎంపికైంది. నిన్న రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ఇండియన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా నటి రమ్యకృష్ణ, నిర్మాత యార్లగడ్డ శోభులు ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు.

ఇక 2015లో ఇదే అవార్డును దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. ఈ ఏడాది మాత్రం... చిత్రం కోసం పని చేసిన వారందరికిగాను ఈ అవార్డును అందించారు. ఈ కార్యక్రమానికి కపిల్ దేవ్, కోహ్లీతో పాటు పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ, త్వరలోనే 'బాహుబలి-3' ఉంటుందని ఎవరూ భావించవద్దని చెప్పారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ, బాహుబలిలో నటించిన అనుభవం జీవితాంతం గుర్తుంటుందని అన్నారు.

More Telugu News