రిటైరవుతూ ఐసీసీకి సవాల్ విసిరిన పాక్ వివాదాస్పద బౌలర్ సయీద్!
- అంతర్జాతీయ క్రికెట్ కు అజ్మల్ గుడ్ బై
- బౌలర్లందరినీ టెస్ట్ చేయండి.. 90 శాతం మంది ఫెయిల్ అవుతారన్న అజ్మల్
- అసంతృప్తితో రిటైర్ అవుతున్నానన్న స్పిన్నర్
2011 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తో ఆడిన మ్యాచ్ తనకు ఇప్పటికీ అర్థం కాలేదని సయీద్ చెప్పాడు. ఆ మ్యాచ్ లో 37వ ఓవర్లో తన బౌలింగ్ లో అఫ్రిదీకి క్యాచ్ ఇచ్చి సచిన్ ఔటయ్యాడని... అంతకు ముందు తన బౌలింగ్ లోనే వికెట్ల ముందు దొరికిపోయాడని... కానీ, ఆ రెండు సార్లు కూడా సచిన్ ను అంపైర్లు నాటౌట్ గానే ప్రకటించారని... అలా ఎందుకు చేశారో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. ఆ మ్యాచ్ లో సచిన్ 85 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడని చెప్పాడు.