gang rape: నాలుగేళ్ల కిందట సామూహిక అత్యాచారం.. ఆ వీడియోను ఇప్పుడు బాధితురాలి భర్తకు పంపిన కీచకులు!

  • నాలుగేళ్ల కిందట జ్యూస్ లో మత్తుమందిచ్చి సామూహిక అత్యాచారం
  • హైదరాబాదుకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న బాధితురాలు
  • వాట్స్ యాప్ ద్వారా భర్తకు వీడియో పంపిన నిందితులు

నాలుగేళ్ల కిందట సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు కీచకులు అప్పుడు చిత్రీకరించిన వీడియోతో బాధితురాలిని ఇప్పటికీ వేధిస్తున్న దుర్మార్గమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... రాష్ట్రంలోని కోలారు జిల్లా శ్రీనివాసపురానికి చెందిన యువతికి జ్యూస్‌ లో మత్తు మందు ఇచ్చి ఇద్దరు యువకులు నాలుగేళ్ల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని వీడియోగా తీసి దానిని భద్రపరుచుకున్నారు.

అప్పటి నుంచి ఆమెను వేధించడం ప్రారంభించారు. కొన్నాళ్లకు ఆమెకు హైదరాబాదుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమెపై వేధింపులు ఆపలేదు. తాజాగా బాధితురాలి భర్తకు వాట్స్ యాప్ ద్వారా ఆ వీడియోను పంపారు. దీంతో ఆయన బాధితురాలిని దూరం పెట్టాడు. దీంతో ఆమె శ్రీనివాసపురం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకడైన ఆరిఫ్‌ ను అదుపులోకి తీసుకున్నారు. మరొక కీచకుడు తౌసిఫ్‌ పరారీలో ఉన్నాడు.

More Telugu News