Shraddha Shashidhar: మిస్ యూనివ‌ర్స్‌-2017 పోటీలో భార‌త్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ చెన్నై సుంద‌రి!

  • మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో శ్ర‌ద్ధ శ‌శిధ‌ర్‌
  • భార‌త్‌కు మ‌రో కిరీటం అందిస్తాన‌ని ధీమా
  • ఆదివారం లాస్‌వేగాస్‌లో ప్రారంభమైన పోటీలు

హ‌రియాణాకు చెందిన మానుషి చిల్లార్ ప్ర‌పంచ సుంద‌రిగా నెగ్గి భార‌త ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటింది. దీంతో ఇప్పుడు లాస్‌వేగాస్‌లో ఆదివారం ప్రారంభ‌మైన మిస్ యూనివ‌ర్స్‌-2017 పోటీల‌పై అంద‌రి దృ‌ష్టి మ‌ళ్లింది. ఈ పోటీలో చెన్నైకి చెందిన శ్ర‌ద్ధ శ‌శిధ‌ర్ (20) భార‌త్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. నాసిక్‌లోని డియోలాలి ఆర్మీ  ప‌బ్లిక్ స్కూల్లో చ‌దువుకున్న ఆమె ముంబైలోని సోఫియా కాలేజీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసింది.

చ‌దువుతోపాటు ఆట‌ల్లోనూ చురుగ్గా పాల్గొనే శ్ర‌ద్ధ జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్ కూడా. క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ అయిన ఈ అమ్మాయి య‌మ‌హా ఫ్యాసినో మిస్ దివా 2017 కిరీటం, మిస్ టీజీపీసీ (ది గ్రేట్ పీజెంట్ క‌మ్యూనిటీ ) సౌత్ 2017 టైటిళ్లు గెలుచుకుంది. ప్ర‌స్తుతం భార‌త్ త‌ర‌పున మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొన్న శ్ర‌ద్ధ దేశానికి మ‌రో కిరీటం అందిస్తాన‌ని ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేసింది.

More Telugu News