Vijayawada: విజ‌య‌వాడ‌లో ఓ ఇంటిపై వింత పక్షులు!

  • ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్నంలో వింత ప‌క్షులు
  • విజ‌య‌వాడ అయ్యప్పనగర్‌లో విభిన్నాకారంలో ప‌క్షులు
  • రాత్రి పూట వ‌చ్చి వాటికి ఆహారం పెడుతోన్న ప‌క్షుల త‌ల్లి

ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్నంలో వింత ప‌క్షులు క‌నిపించి అంద‌రినీ కంగారు పెట్టిన విష‌యం తెలిసిందే. అవి వింత ఆకారంలో ఉండ‌డంతో వాటిని ఏలియ‌న్స్ అంటూ, ఇత‌ర గ్ర‌హాల మీద ఇటువంటి ప‌క్షులు ఉంటాయంటూ సోష‌ల్ మీడియాలో ఫొటోలు విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొట్టాయి. తీరా అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలించడంతో అవి జీలుగు పక్షులుగా నిర్ధారణ అయ్యాయి.

తాజాగా కృష్ణాజిల్లా విజయవాడలోనూ అటువంటి వింతపక్షులు వెలుగులోకి వ‌చ్చాయి. న‌గ‌రంలోని అయ్యప్పనగర్‌లోని తులసీ రాం ఇంటిపై ఐదు వింత‌ పక్షులు క‌న‌ప‌డ్డాయి. అవి విచిత్ర శ‌బ్దాలు కూడా చేశాయి. మొద‌టి వాటిని చూసి భ‌య‌ప‌డ్డ స్థానికులు ఆ త‌రువాత వాటిని ప‌ట్టుకుని ఫొటోలు దిగారు. వాటి తల్లి పక్షి రాత్రివేళల్లో వచ్చి ఆహారం పెడుతోంది. నగరవాసులు వీటిని వింతగా చూస్తున్నారు.  

More Telugu News