charan: చరణ్ తో బోయపాటి సినిమా మొదలు .. కథానాయికగా మళ్లీ రకుల్?

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ సినిమా 
  • ప్రొడక్షన్ ఆఫీస్ లో ఈ రోజున పూజా కార్యక్రమాలు 
  • జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ 

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'సరైనోడు' సినిమా చూసిన తరువాత, ఆయన దర్శకత్వంలో చేయడానికి చిరంజీవి ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. అయితే అనుకోకుండా బోయపాటి దర్శకత్వంలో ఆయనకంటే ముందుగా చరణ్ చేసేస్తున్నాడు. డీవీవీ దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమా ఈ రోజున హైదరాబాదులోని ప్రొడక్షన్ ఆఫీస్ లో ఎలాంటి హడావిడి లేకుండా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి జరుగుతుంది. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. రకుల్ ని తీసుకోవడం జరిగితే .. చరణ్ తోను .. బోయపాటితోను ఆమెకి ఇది మూడవ సినిమా అవుతుంది. 

More Telugu News