venumadhav: చిరూ .. బాలయ్యలను కాకాపట్టడం కోసం కాదు .. అభిమానంతో 'గుండు' చేయించుకున్నాను: కమెడియన్ వేణుమాధవ్

  • చిరంజీవి .. బాలకృష్ణ అంటే ఇష్టం
  • వినాయక్ .. క్రిష్ నాకు మంచి మిత్రులు
  • ఆ సినిమాలు హిట్ కావాలని కోరుకున్నా
  • అందులో మరో ఉద్దేశం లేదు      

మనకున్న మంచి హాస్య నటుల్లో వేణుమాధవ్ ఒకరు. కామెడీలో తనదైన టైమింగ్ .. బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రత్యేకమైన మేనరిజంతో గిలిగింతలు పెట్టే వేణుమాధవ్, తాజాగా ఐడ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు." చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' హిట్ కావాలని మీరు తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకున్నారట .. నిజమేనా?" అనే ప్రశ్న వేణుమాధవ్ కి ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ .. "చిరూ 150 వ సినిమా కోసం .. బాలకృష్ణ 100వ సినిమా కోసం నేను 'గుండు' చేయించుకున్నాను. వాళ్లిద్దరంటే నాకు చాలా ఇష్టం .. ఇద్దరితోను మంచి అనుబంధం వుంది. ఒక సినిమాకి వినాయక్ దర్శకుడైతే .. మరో సినిమాకి దర్శకుడు క్రిష్. వాళ్లిద్దరూ నాకు మంచి మిత్రులే. నటుడిగా నా రేంజ్ పెరిగేలా చేసింది వినాయక్ .. క్రిష్ తోను ఎంతో సాన్నిహిత్యం వుంది. అందువలన ఈ సినిమాలు హిట్ కావాలని అలా చేశానే తప్ప .. వాళ్లను కాకా పట్టడం కోసం కాదు" అంటూ చెప్పుకొచ్చారు.     

More Telugu News