KTR: మెట్రోరైల్ ప్రారంభోత్స‌వానికి కేంద్ర మంత్రికి కేటీఆర్ ఆహ్వానం!

  • ఢిల్లీలో కేంద్ర మంత్రుల‌తో కేటీఆర్ భేటీ
  • ఈ నెల 28న మెట్రోరైల్‌ ప్రారంభోత్స‌వం
  • కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్‌ను ఆహ్వానించిన కేటీఆర్‌

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌తో చ‌ర్చించిన అనంత‌రం కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్, హ‌ర్‌దీప్ సింగ్‌తో విడివిడిగా కేటీఆర్ భేటీ అయ్యారు. కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్‌తో ప‌లు అంశాల‌పై కేటీఆర్ చ‌ర్చించారు. మిష‌న్ భ‌గీర‌థ‌, రెండు ప‌డ‌క‌ గ‌దుల ఇళ్ల‌ నిర్మాణంతో పాటు తెలంగాణలో అమ‌లు చేస్తోన్న ప‌లు ప‌థ‌కాల‌పై హ‌ర్‌దీప్ సింగ్‌కు తాను వివ‌రించిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. అలాగే ఈ నెల 28న హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్స‌వానికి హాజ‌రుకావాల‌ని ఆయ‌న‌ను ఆహ్వానించిన‌ట్లు కేటీఆర్‌ చెప్పారు. 

More Telugu News