Vijayawada: విజ‌య‌వాడ‌లో ముగ్గురు రైతుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. క‌ల‌క‌లం

  • నాసిర‌కం విత్తనాలతో ఏడాది క్రితం పంట కోల్పోయిన పెనుగోలు రైతులు
  • ప‌రిహారం కోరుతూ అసెంబ్లీకి వెళుతుండ‌గా అడ్డుకున్న పోలీసులు
  • నున్న పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద పురుగుల మందు తాగిన రైతులు
  • ఆసుప‌త్రిలో చికిత్స‌

విజ‌య‌వాడ‌లో ముగ్గురు రైతులు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. నున్న పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద గంపలగూడెం మండలానికి చెందిన పూర్ణ‌య్య‌, తిరుప‌తిరావు, రామ‌య్య అనే రైతులు పురుగుల మందు తాగి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. ముగ్గురు రైతుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే, నాసిర‌కం విత్తనాలతో ఏడాది క్రితం పంట కోల్పోయిన పెనుగోలు రైతులు ప‌రిహారం కోసం చెప్పులు అరిగిపోయేలా తిరిగారు. అసెంబ్లీకి వెళ్లి త‌మ బాధ‌ల‌ను చెప్పాల‌నుకున్నారు. అందుకోసం రైలులో కొంత‌మంది రైతులు విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. అయితే వారిని పోలీసులు రైల్వే స్టేష‌న్ వ‌ద్దే అడ్డుకుని, నున్న పీఎస్‌కు త‌ర‌లించ‌గా అందులోని ముగ్గురు రైతులు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు.

More Telugu News