bihar: ప్రధాని గొంతు కోయడానికి, చేతులు నరకడానికి బిహారీలు సిద్ధంగా ఉన్నారు: ర‌బ్రీదేవి తీవ్ర‌వ్యాఖ్య‌లు

  • బీజేపీ చీఫ్ నిత్యానంద‌రాయ్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌
  • మోదీని విమ‌ర్శించిన వారి చేతులు న‌ర‌కాలన్న బీజేపీ చీఫ్‌
  • ఆర్జేడీ జాతీయ కౌన్సిల్‌ స‌మావేశంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ర‌బ్రీదేవి

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని విమ‌ర్శించిన వారి చేతులు న‌రికేయాలని బీజేపీ చీఫ్ నిత్యానంద రాయ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గా బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి ర‌బ్రీ దేవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి, చేతులు న‌ర‌క‌డానికి చాలా మంది బిహారీలు సిద్ధంగా ఉన్నార‌ని ఆమె అన్నారు. ఆర్జేడీ జాతీయాధ్య‌క్షుడిగా లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను వ‌రుస‌గా 10వ సారి ఎన్నుకున్న జాతీయ కౌన్సిల్ స‌మావేశంలో ఆమె మాట్లాడారు.

'పీఎం మోదీని వేలెత్తి చూపితే, వేళ్లు న‌రికేస్తామ‌ని కొంద‌రు బీజేపీ నాయ‌కులు చెబుతున్నారు. ద‌మ్ముంటే బిహారీల చేతులు న‌ర‌క‌మ‌ని నేను వారిని ఛాలెంజ్ చేస్తున్నా. బిహారీలు ఊరికే ఊరుకోరు. న‌రేంద్రమోదీ గొంతు కోయ‌డానికి, చేతులు న‌ర‌క‌డానికి చాలామంది బిహారీలు సిద్ధంగా ఉన్నారు' అని ర‌బ్రీ దేవి అన్నారు. ఇటీవ‌ల అవినీతి కేసుల నెపంతో లాలూని, వారి కుమారుడు సంతోష్ యాద‌వ్‌ను బీజేపీ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఇలాంటి వ్యాఖ్య‌లు చేసినట్లు స‌మాచారం.

More Telugu News