mi: భార‌త్‌లో ఎంఐ స్మార్ట్‌ఫోన్ల‌ ఎక్స్ఛేంజ్ సౌక‌ర్యం క‌ల్పించిన షియోమి

  • న్యూఢిల్లీకి చెందిన క్యాషిఫై సంస్థ‌తో ఒప్పందం
  • ఎక్స్ఛేంజ్ ధ‌ర‌ను నిశ్చ‌యించే అధికారం క్యాషిఫైకి
  • ఎంఐ స్టోర్ల‌లో ఎక్స్ఛేంజ్ స‌దుపాయం

భార‌త‌దేశంలో త‌మ మార్కెట్‌ను మ‌రింత పెంచుకునేందుకు షియోమి సంస్థ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో మొద‌టిసారిగా దేశంలో ఎక్స్ఛేంజ్ ద్వారా ఎంఐ స్మార్ట్‌ఫోన్ల‌ను సొంతం చేసుకునే సదుపాయం క‌ల్పించింది. ఇందుకోసం న్యూ ఢిల్లీకి చెందిన క్యాషిఫై అనే సంస్థ‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సౌక‌ర్యం ద్వారా భార‌త వినియోగ‌దారులు త‌మ పాత ఫోన్ల‌ను ఎంఐ స్టోర్‌లో ఇచ్చేసి, కొత్త ఎంఐ స్మార్ట్‌ఫోన్ పొంద‌వ‌చ్చు. అయితే పాత ఫోన్ల‌కు ఎంత ధ‌ర నిర్ణ‌యించాల‌నే హ‌క్కును షియోమి, క్యాషిఫై సంస్థ‌కు అప్ప‌గించింది.

వారు నిర్ణ‌యించిన ధ‌ర‌కు అనుగుణంగా, కొత్త ఎంఐ ఫోన్ ధ‌ర‌లో డిస్కౌంట్ ఇస్తారు. మీ పాత మొబైల్ విలువ ఎంత ఉంటుందో క్యాషిఫై యాప్ ద్వారా కూడా తెలుసుకోవ‌చ్చు. క్యాషిఫై వారి ఎక్స్చేంజ్ ధ‌ర న‌చ్చిన వారు త‌మ మొబైల్ ఫోన్‌ను ఇచ్చేసి, ఎంఐ స్మార్ట్‌ఫోన్ పొంద‌వ‌చ్చు.

More Telugu News