shabari: శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స‌న్నిధిలోకి ప్ర‌వేశించ‌డానికి య‌త్నించిన బాలిక‌... పట్టుకున్న అధికారులు

  • అబ్బాయి వేషంలో ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని న‌ల్లూరుకి చెందిన బాలిక‌
  • సంఘ‌ట‌న‌తో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు

రుతుక్ర‌మం కార‌ణంగా 10 నుంచి 50 ఏళ్ల వ‌య‌సున్న మహిళలు శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స‌న్నిధిలో ప్ర‌వేశించ‌కుండా నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి బాలిక‌ల‌ను లోప‌లికి తీసుకెళ్లేందుకు కొంత‌మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. గ‌తంలో అలా ప్ర‌య‌త్నించిన ఓ 13 ఏళ్ల బాలిక‌ను ప‌ట్టుకున్నారు. మ‌ళ్లీ అలాంటి సంఘ‌ట‌నే మ‌రొక‌టి జ‌రిగింది.

అబ్బాయి వేష‌ధార‌ణ‌లో అయ్య‌ప్ప స‌న్నిధిలోకి ప్ర‌వేశించడానికి ప్ర‌య‌త్నించిన‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని న‌ల్లూరుకి చెందిన ఓ 15 ఏళ్ల బాలికను పంపాలోని దేవాస్వోం సిబ్బంది గుర్తించి అడ్డుకున్నారు. 15 మంది పురుష స్వాముల‌తో క‌లిసి వ‌చ్చిన ఆ బాలిక‌, అబ్బాయిలా క‌నిపించేందుకు ఆమెకు జు‌ట్టు తీసేసి, టోపీ పెట్టారు.

స‌న్నిధిలోకి ప్ర‌వేశించేట‌ప్పుడు ఎవ‌రూ గుర్తించ‌కుండా ఆ 15 మంది స్వాములు అడ్డునిల‌బ‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ ఆ పాప క‌ద‌లిక‌ల మీద అనుమానం వచ్చి దేవాస్వోం సిబ్బంది ఆమెను ఆపి, బాలిక‌గా గుర్తించారు. ఆమెను అక్క‌డే ఆపి, మిగ‌తా 15 మంది స్వాములు వ‌చ్చే వ‌ర‌కు ఆఫీసులో ఉంచారు. ఈ ఘ‌ట‌న‌తో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ప్ర‌తి ఒక్క‌రిని నిశితంగా ప‌రిశీలించ‌డం ప్రారంభించారు.

More Telugu News