shivasena: మోదీ వ‌ల్లే చిల్ల‌ర్ ప్ర‌పంచ సుంద‌రి కిరీటాన్ని సంపాదించింద‌ని బీజేపీ చెప్పుకోవ‌ట్లేదేంటీ?: శివసేన‌ వ్యంగ్యం

  • రెండు రోజుల క్రితం మిస్ వ‌రల్డ్ కిరీటం సాధించిన మానుషి చిల్ల‌ర్‌
  • మానుషి ఘ‌న‌త‌ను కూడా మోదీని విమ‌ర్శించ‌డానికి ఉప‌యోగించుకున్న‌ శివ‌సేన
  • ఆమె ఘ‌న‌త కూడా మోదీ చ‌ల‌వేన‌ని చెప్పుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే అంటూ ఎద్దేవా  

భార‌త్‌కు ప్ర‌పంచ సుంద‌రి కిరీటాన్ని తెచ్చిపెట్టిన మానుషి చిల్ల‌ర్ ఘ‌న‌త‌ను కూడా ప్ర‌ధాన‌మంత్రి మోదీని విమ‌ర్శించ‌డానికి ఉప‌యోగించుకుంది శివ‌సేన పార్టీ. దేశంలో ఎవ‌రు ఏ విజ‌యాన్ని సాధించినా త‌మ విజ‌య‌మే అన్న‌ట్లు మోదీ ప్ర‌భుత్వం చెప్పుకుంటోంద‌న్న‌ట్లు శివ‌సేన‌ పార్టీ పత్రిక సామ్నా త‌మ‌ సంపాదకీయంలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

దీనిని దృష్టిలో పెట్టుకునే, ప్ర‌ధాని మోదీ వల్లే మానుషి మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ను తీసుకువచ్చిందని బీజేపీ నేతలెవరూ ఇంకా ప్రకటించుకోలేదంటూ ఎద్దేవా చేసింది. ఆమె కిరీటాన్ని ద‌క్కించుకోవ‌డం మోదీ చలవేనంటూ బీజేపీ నేతలు ముందుకు రాకపోవడం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని చుర‌క‌లంటించింది.

More Telugu News