Revanth Reddy: య‌శోద ఆసుప‌త్రికి వెళ్లి జానారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి

  • ఐదు రోజుల‌ క్రితం అస్వ‌స్థ‌త‌కు గురైన జానారెడ్డి
  • ప్ర‌స్తుతం సోమాజిగూడ య‌శోద ఆసుప‌త్రిలో జానారెడ్డికి చికిత్స‌
  • ప‌రామ‌ర్శించిన రేవంత్ రెడ్డి

ఐదు రోజుల‌ క్రితం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌ హైద‌రాబాద్ సోమాజిగూడ‌లోని య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. జానారెడ్డి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు స‌మాచారం. ఈ రోజు య‌శోద ఆసుప‌త్రికి వెళ్లిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. జానారెడ్డిని ప‌రామ‌ర్శించి, ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిని డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. జానారెడ్డి ఆసుప‌త్రిలో కోలుకున్నట్లు సమాచారం.  

More Telugu News