metro rail: హైద‌రాబాద్ మెట్రోప్రాజెక్టులో కీల‌క అడుగు

  • ఎస్ఆర్ న‌గ‌ర్‌-మెట్టుగూడ మ‌ధ్య రైళ్ల రాక‌పోక‌ల‌కు సీఎంఆర్ఎస్ అనుమ‌తి
  • మూడు రోజుల పాటు త‌నిఖీలు నిర్వ‌హించిన అధికారులు
  • ఈ నెల 28 నుంచి తొలిద‌శ మెట్రో ప‌రుగులు

హైద‌రాబాద్ వాసుల క‌ల‌ల బండి మెట్రోరైల్‌ను ఈ నెల 28 నుంచి ప్రారంభించే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ రోజున నాగోల్‌-మియాపూర్ వ‌ర‌కు మెట్రోరైల్ కూత పెట్ట‌నుంది. ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మెట్రో రైల్ తొలిద‌శ‌ను ప్రారంభించే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా, హైద‌రాబాద్ మెట్రో ప్రాజెక్టులో మ‌రో కీల‌క అడుగు ముందుకు ప‌డింది. ఎస్ఆర్ న‌గ‌ర్‌-మెట్టుగూడ మ‌ధ్య రైళ్ల రాక‌పోక‌ల‌కు సీఎంఆర్ఎస్ అనుమ‌తినిచ్చింది. మూడు రోజుల పాటు అధికారులు ఈ మార్గాన్ని త‌నిఖీ చేశారు.       

More Telugu News