Pawan Kalyan: త్రివిక్ర‌మ్ తీస్తున్న‌ సినిమాలో పాట పాడ‌నున్న ప‌వ‌న్ కల్యాణ్‌?

  • 'కొడ‌కా... కోటేశ్వ‌రా!' అంటూ సాగే పాట‌
  • గ‌తంలో రెండు సార్లు గొంతు స‌వ‌రించిన ప‌వ‌న్‌
  • సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న అనిరుధ్ ర‌విచంద‌ర్‌

త‌న ప్రాణ‌స్నేహితుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న 'అజ్ఞాతవాసి' చిత్రం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ గొంతు స‌వరించుకోనున్న‌ట్లు తెలుస్తోంది. 'కొడ‌కా... కోటేశ్వ‌రా!' అంటూ సాగే పాట‌ను ప‌వ‌న్ పాడ‌నున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. గ‌తంలో జాని, అత్తారింటికి దారేది చిత్రాల్లో ప‌వ‌న్ పాట‌లు పాడిన విష‌యం తెలిసిందే.

అనిరుధ్ ర‌విచంద‌ర్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ అభిజిత్ భార్గ‌వ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని 'బ‌య‌టికొచ్చి చూస్తే' అనే పాట అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. విల‌న్‌గా బొమ‌న్ ఇరానీ, ఓ కీల‌క పాత్ర‌లో ఖుష్బూ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు చిత్ర‌యూనిట్ ప్ర‌య‌త్నిస్తోంది.

More Telugu News