ramgopal varma: మైండ్ దొబ్బిన మాట నిజం... మిగతావి ఈ సినిమా తరువాత తెలుస్తాయి!: నాగ్ చిత్రం ప్రారంభోత్సవంలో వర్మ

  • అన్నపూర్ణా స్టూడియోస్ లో కొత్త సినిమా ప్రారంభం 
  • నాగ్ పై చిత్రీకరించిన వర్మ
  • మైండ్ మాత్రమే దొబ్బింది... జ్యూస్ ఉందో లేదో తెలుస్తుందన్న వర్మ

28 సంవత్సరాల క్రితం సూపర్ హిట్ అయి, తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన 'శివ' కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. నాగార్జున హీరోగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ముహూర్తపు షాట్ కొద్దిసేపటి క్రితం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించారు.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, 'శివ' చిత్రం సమయంలో నాగార్జున తనపై నమ్మకం ఉంచి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో, ఇప్పుడూ అదే విధమైన స్వేచ్ఛను తనకిచ్చారని అన్నాడు. ఈ కథను తాను నాగ్ కు చెప్పిన తరువాత, ఎంతో ఎగ్జయిట్ అయ్యారని, తాను అంతే ఇన్టెన్సిటీతో సినిమాను తీయనున్నానని అన్నాడు.

తాను నాగార్జునను ఎక్కువగా నమ్ముతానని, కథ విన్న తరువాత నాగ్ రియాక్షన్ చూసిన తరువాత ఈ సినిమాపై నాకు ఎంతో నమ్మకం పెరిగిందని అన్నాడు. "గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయింది అంటున్నారు. అందులో మైండ్ దొబ్బిందన్న మాట నిజం. కానీ, జ్యూస్ అయిపోయిందా? లేదా? అన్నది ఈ సినిమా తరువాత తెలుస్తుంది" అన్నారు.

More Telugu News