Kajal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • డబ్బు కూడా ముఖ్యమే అంటున్న కాజల్ 
  • తాజా షెడ్యూల్ లో బాలకృష్ణ 'జై సింహా'
  • నిర్మాతలపై గౌరవం ఇంకా పెరిగిందంటున్న చరణ్
  • సెన్సార్ కు వెళుతున్న 'బాలకృష్ణుడు'    

*  'డబ్బు ఎక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పి ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేస్తే త్వరగానే మన కెరీర్ పూర్తయిపోతుంది' అంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. "డబ్బు సంపాదించడం అనేది ముఖ్యమే, కాదనను.. అయితే, దాంతో పాటు కెరీర్ కూడా ముఖ్యం కదా, అందుకని డబ్బు కోసం ఏది పడితే అది చేసేయకూడదు. అలా చేసేస్తే త్వరగానే మనం ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుంది" అని చెప్పింది కాజల్.      
*  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం 'జై సింహా' తాజా షెడ్యూలు షూటింగ్ రెండు రోజుల్లో రామోజీ ఫిలిం సిటీలో మొదలవుతుంది. డిసెంబర్ 1 కల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నటాషా దోషీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  చిత్ర నిర్మాణం ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని చెబుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీని వల్ల నిర్మాతలపై తనకు మరింత గౌరవం పెరిగిందని చెప్పాడు. చిరంజీవితో నిర్మించిన 'ఖైదీ నెం 150' చిత్రంతో నిర్మాతగా కూడా మారిన చరణ్, ప్రస్తుతం తండ్రితోనే 'సై రా' చిత్రాన్ని చేస్తున్నాడు. అయితే, ఈ చిత్రం తర్వాత నిర్మాతగా కాస్త బ్రేక్ తీసుకుంటానని చెప్పాడు.
*  నారా రోహిత్ హీరోగా నటించిన 'బాలకృష్ణుడు' చిత్రం ఈ రోజు సెన్సార్ కు వెళుతోంది. పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 24న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇందులో రెజీనా హీరోయిన్ గా నటించింది.  

More Telugu News