miss world: మానుషి చిల్లర్ కు చప్పట్లతో పాటు మిస్ వరల్డ్ టైటిల్ తెచ్చిన ప్రశ్న, జవాబులివి!

  • అత్యధిక వేతనం ఇవ్వాల్సిన వృత్తి ఏది?
  • 'అమ్మ'కు అంటూ సమాధానం ఇచ్చిన మానుషి
  • మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన ఆరో భారత సుందరి

దాదాపు 17 సంవత్సరాల తరువాత ఓ భారత సుందరి 'ప్రపంచ సుందరి' టైటిల్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. చైనాలో జరిగిన మిస్ వరల్డ్ తుది పోటీల్లో హర్యానా అందగత్తె మానుషి చిల్లర్, ఫైనల్ రౌండులో తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తీరు ఆమె సమయస్ఫూర్తికి చప్పట్లతో పాటు కిరీటాన్ని కూడా అందించింది.

"ప్రపంచంలో అత్యధిక వేతనం ఇవ్వాల్సిన వృత్తి ఏది?" అన్న ప్రశ్న న్యాయనిర్ణేతల నుంచి ఎదురు కాగా, "అమ్మ"కు అని మానుషి సమాధానం ఇచ్చింది. "జీతమంటే కేవలం డబ్బు మాత్రమే కాదని నేను భావిస్తున్నా. ప్రేమ, గౌరవం, వీటిని మించిన జీతం ఏముంటుంది? చిన్నప్పటి నుంచి నాకు అమ్మే నాకు స్ఫూర్తి. ఆ రకంగా చూస్తే అమ్మతనానికి, పిల్లల కోసం త్యాగాలు చేసే తల్లులకు ఈ ప్రపంచంలో అత్యధిక జీతం అందించాలి" అని సమాధానం ఇచ్చింది.

ఈ సమాధానం తరువాత ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. ఆపై కాసేపటికే ఆమెకు కిరీటం లభించింది. మానుషి విజయంతో ఇండియాకు ఆరోసారి మిస్ వరల్డ్ టైటిల్ లభించినట్లయింది.

More Telugu News