ramgopal varma: ఆ వార్త పచ్చి అబద్ధం.. అమితాబ్ నటించడం లేదు!: రాం గోపాల్ వర్మ

  • వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న నాగార్జున
  • టబూ, అమితాబ్ నటిస్తున్నారని వార్తలు
  • వారిద్దరూ నటించడం లేదని ఫేస్ బుక్ లో వర్మ స్పష్టీకరణ

నాగార్జున హీరోగా తాను నిర్మిస్తున్న చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటి టబు కూడా నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలను దర్శకుడు రాంగోపాల్ వర్మ ఖండించాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును ఉంచారు. నాగార్జున చిత్రంలో టబూ, బిగ్ బీ ఉన్నారని వచ్చిన వార్త పచ్చి అబద్ధమని తేల్చి చెప్పాడు. వారిద్దరూ ఈ సినిమాలో నటించడం లేదని ఆయన స్పష్టం చేశాడు.

కాగా, తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన 'శివ' కాంబినేషన్, మరోసారి అటువంటి విజయాన్నే సాధించేలా పక్కా స్క్రిప్టుతో సిద్ధమై త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇతర నటీనటులను ఎంపిక చేయాల్సి వుండగా, నెట్టింట రోజుకో వార్త పుట్టుకొస్తోంది.

More Telugu News