ketireddy jagadeesh reddy: బెదిరిస్తున్నారు.. రక్షణ కల్పించండి: ఏపీ, టీఎస్ డీజీపీలను కోరిన దర్శకుడు కేతిరెడ్డి

  • బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
  • తొలి నుంచి లక్ష్మీపార్వతి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
  • ఆమె వైఖరిని ఎండగడతా 

తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలంటూ ఏపీ, తెలంగాణ డీజీపీలను కోరారు. రెండ్రోజుల క్రితం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ముహూర్తపు షాట్ ను చిత్రీకరించేందుకు కేతిరెడ్డి ప్రయత్నించారు. అయితే, పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే లక్ష్మీపార్వతి అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారని చెప్పారు. లక్ష్మీపార్వతి వైఖరిని ఎండగడతానని అన్నారు.

మరోవైపు, కేతిరెడ్డిలాంటి పాపుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ అపవిత్రమైందని పేర్కొంటూ... ఎన్టీఆర్ సమాధికి పాలాభిషేకం చేశారు లక్ష్మీపార్వతి. తనను, ఎన్టీఆర్ ను అగౌరవపరిచేందుకే ఈ సినిమాను తీస్తున్నారని మండిపడ్డారు. తల్లి, చెల్లి ఉన్నవారు ఇలాంటి పనులు చేయరని అన్నారు.

More Telugu News