sunitha: ఉష.. నేను మాటా మాటా అనుకోలేదు .. ఉదయభాను కూడా నన్ను అపార్థం చేసుకుంది!: గాయని సునీత

  • ఉష ..నేను గొడవపడలేదు 
  • తను నాతో కంఫర్టబుల్ గా ఉండేది కాదు
  • ఉదయభాను కూడా నా గురించి అలా మాట్లాడింది 
  • నాకు ఎవరిపైనా ఎలాంటి జెలసీ లేదు  

సుమధుర గాయనిగా సునీతకు మంచి పేరుంది. ఆమె మాటలానే పాట కూడా సున్నితంగా ..సుకుమారంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సునీత తన కెరియర్ కి సంబంధించిన విషయాలను తాజాగా ఐ డ్రీమ్స్ తో పంచుకున్నారు. సింగర్ ఉషతో తనకి మనస్పర్థలు వున్నాయంటూ జరుగుతోన్న ప్రచారం గురించి ఆమె ప్రస్తావించారు.

 "మేం మాటా మాటా అనుకున్న సందర్భాలైతే నాకు గుర్తు లేవు. ఎందుకో తెలియదుగానీ నాతో ఆమె సరిగ్గా మాట్లాడేది కాదు. ఇద్దరం కలుసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. నాకన్నా మిగతా వాళ్లు ఎక్కువ పాటలు పాడేస్తున్నారనే జెలసీ ఫీలింగ్ కూడా నాకు లేదు. అలాంటి ఫీలింగే గనుక నాకు ఉంటే ఈ పాటికి చచ్చిపోవాలి. ఎందుకంటే నా కన్నా వెనకొచ్చిన వాళ్లలో ఎక్కువ పాటలు పాడేసినవారున్నారు"

"మొదటి నుంచి కూడా నాతో ఉష కంఫర్టబుల్ గా ఉండేది కాదు. అవతలవాళ్లను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో నేను ఉండేదానిని. నా సన్నిహితులు చెప్పిన దానిని బట్టి .. నేను ఏదో సందర్భంలో ఏదో అన్నాననుకుని ఆమె ఫీలైందని తెలిసింది. నన్ను అపార్థం చేసుకున్నవాళ్ల జాబితా చాలా పెద్దదే అనే విషయం కూడా నాకు ఈ మధ్యనే అర్థమైంది.

నా ప్రోగ్రామ్ లో అవమానం జరిగిందనీ .. అందుకు నేనే కారణమని పేరు ప్రస్తావించకుండానే ఉదయభాను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నిజానికి ఆమె అంటే నాకు ఎలాంటి జెలసీ లేదు .. ఆ తరువాత నాతో ఆమె సరిగ్గా మాట్లాడేది కాదు .. కారణం ఏమిటా? అని నేను అనుకునేదాన్ని. తన మనసులోని మాటను అప్పుడే చెప్పేసి వుంటే .. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడుకోవలసి వచ్చేది కాదు. మనకి తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి అంతే .." అంటూ చెప్పుకొచ్చారు సునీత.     

More Telugu News