simbu: హీరో శింబు ఇంటికి భారీ భద్రత.. బీజేపీ నేతలు దాడి చేసే అవకాశం

  • వివాదం రేపిన శింబు పాట
  • జీఎస్టీ, నోట్ల రద్దుపై పాటలో విమర్శలు
  • పాట నేను రాయలేదన్న శింబు

తమిళ సినీ హీరో శింబును మరో వివాదం చుట్టుముట్టింది. తన తాజా చిత్రం 'థత్రోం థూక్రోం'లోని ఓ పాటను పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా విడుదల చేశారు. ఈ పాటలో జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుపై విమర్శలు ఉన్నాయి. విజయ్ మాల్యాలాంటి వారిని కూడా ఈ పాటలో ప్రస్తావించారు. ఇప్పుడు ఈ పాట కాస్తా వివాదాస్పదం అయింది.

ఈ క్రమంలో ఆయన ఇంటిపై బీజేపీ నేతలు ఆందోళన చేసే అవకాశం ఉందని చెన్నై పోలీసులు భావిస్తున్నారు. దీంతో శింబు ఇంటి వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ, ఈ పాటను తాను రాయలేదని చెప్పాడు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఈ పాటలో ఉన్నాయి కాబట్టే... పాటను పాడాలని తాను నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

More Telugu News