పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి స్పీకర్ కోడెల స్పందన!
- కేసు సుప్రీంకోర్టులో ఉంది
- ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయగలను?
- నేను నిర్ణయం తీసుకోక ముందే వైసీపీ నేతలు కోర్టు మెట్లు ఎక్కారు
ఫిరాయింపు కారణాన్ని చూపుతూ, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని వైసీపీ నేతలు చెప్పడం బాధాకరమని కోడెల అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాము అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని వారు అంటున్నారని... అయితే, ఎన్టీఆర్ తానొక్కరే అసెంబ్లీని బహిష్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ అసెంబ్లీకి రాకపోయినా, టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చారని... చివరి రోజు వరకు సభలో తమ వాదనను వినిపించారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యేలకు తాను ఫోన్ చేశానని తెలిపారు.