కఠోర సత్యం... 33 శాతం డబ్బు డిపాజిట్లు 0.00011 శాతం ప్రజల నుంచే!
- నోట్ల రద్దు తరువాత డిపాజిట్ లెక్కలు
- దినపత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చిన మోదీ ప్రభుత్వం
- రాళ్ల దాడి ఘటనలు 75 శాతం తగ్గాయని వెల్లడి
- 35 వేల షెల్ కంపెనీలను గుర్తించామన్న సర్కారు
ఉగ్రవాద వ్యతిరేకత నుంచి ఉద్యోగ సృష్టి వరకూ ఈ నోట్ల రద్దు పాజిటివ్ ప్రభావాన్ని చూపించిందని, ఈ ప్రకటనలో మోదీ సర్కారు చెప్పుకొచ్చింది. కాశ్మీర్ లో 75 శాతం రాళ్లదాడి ఘటనలు తగ్గిపోయాయని, వామపక్ష తీవ్రవాదం 20 శాతం తగ్గిందని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థను శుభ్రపరిచామని వెల్లడించింది. 2.24 లక్షల షెల్ కంపెనీలను గుర్తించామని, 35 వేలకు పైగా కంపెనీలు 58 వేల బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 17 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిపినట్టు గుర్తించామని వెల్లడించింది. ప్రజలు సహకరించబట్టే ఇదంతా జరిగిందని పేర్కొంది