vijayashanthi: సామాన్య కార్య‌క‌ర్త‌గానే ప‌ని చేస్తా!: రాహుల్ తో విజయశాంతి

  • రాహుల్ గాంధీతో విజ‌య‌శాంతి భేటీ
  • కాంగ్రెస్‌ పార్టీలో సామాన్య కార్య‌క‌ర్త‌గానే ప‌నిచేస్తా: విజ‌య‌శాంతి

ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో విజ‌య‌శాంతి భేటీ అయిన సంగతి విదితమే. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీపీసీీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తాను పార్టీలో సామాన్య కార్య‌క‌ర్త‌గానే ప‌ని చేస్తాన‌ని రాహుల్‌తో విజ‌య‌శాంతి చెప్పారు.

ఈ సంద‌ర్భంగా కుంతియా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం విజ‌య‌శాంతి ప‌నిచేస్తార‌ని అన్నారు. రాహుల్‌ని విజ‌య‌శాంతి భేటీ అయిన నేప‌థ్యంలో ఆమెకు ప్రచార కమిటీలో స్థానం, ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వనున్నట్టు ప్ర‌చారం జరుగుతోంది.   

More Telugu News