asia: ఆసియా మ‌హిళ‌ల బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో ఫైన‌ల్‌కి చేరుకున్న మేరీ కోమ్‌

  • జ‌పాన్‌కు చెందిన త్సుబాసా కొమురాను ఓడించిన భార‌త బాక్స‌ర్‌
  • ఐదో బంగారు ప‌త‌కానికి ఒక్క మ్యాచ్ దూరంలో మేరీ
  • 48 కేజీల విభాగంలో పాల్గొంటున్న మేరీ

వియ‌త్నాంలోని హోచిమన్ సిటీలో జ‌రుగుతున్న ఆసియా మ‌హిళ‌ల బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో భాగంగా జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌లో భార‌త బాక్స‌ర్ మేరీ కోమ్ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో ఆమె ఫైన‌ల్‌లోకి ప్ర‌వేశించి, త‌న ఖాతాలో ఐదో ఆసియా బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్ బంగారు ప‌త‌కం కోసం వేట ప్రారంభించింది.  

48 కిలోల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్లో జ‌పాన్‌కు చెందిన త్సుబాసా కొమురాను 5-0 తేడాతో మేరీ ఓడించింది. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే నాలుగు సార్లు పసిడి, ఒక‌సారి రజతం కైవసం చేసుకున్న మేరీ, ఫైన‌ల్ మ్యాచ్‌లో మంగోలియాకు చెందిన జ‌ర్గలాన్ ఓచిర్‌బ‌ట్‌తో గానీ, డీపీఆర్ కొరియాకు చెందిన కిమ్ హ్యాంగ్ మితోగానీ తలపడనుంది.

More Telugu News