vani vishwanath: రేపు టీడీపీలో చేర‌నున్న న‌టి వాణి విశ్వ‌నాథ్!

  • ఇంద్ర‌కీలాద్రిలో క‌న‌క‌దుర్గను ద‌ర్శించుకున్న వాణి విశ్వ‌నాథ్‌
  • చాలా రోజుల త‌రువాత క‌న‌క‌దుర్గ ఆల‌యానికి వ‌చ్చాను
  • రేపు విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబు నాయుడిని క‌లుస్తా

న‌టి వాణి విశ్వ‌నాథ్ తెలుగుదేశం పార్టీలో చేర‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆమె విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిలో క‌న‌క‌దుర్గను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... చాలా రోజుల త‌రువాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నాన‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. విజ‌య‌వాడ‌లో రేపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని క‌లుస్తాన‌ని చెప్పారు. అలాగే పార్టీలో చేర‌తాన‌ని తెలిపారు. ద‌క్షిణాది సినిమాల్లోనే కాక ఆమె బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టించి మంచి పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.         

More Telugu News