Chandrababu: ఇడుపుల పాయ‌లో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించిన చంద్ర‌బాబు

  • ఇడుపులపాయ‌లో ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి జ‌గ‌న్‌కి క‌నిపించ‌డం లేదా?
  • వ్య‌క్తిగ‌తంగా తిట్ట‌డం మ‌న సంప్రదాయం కాదు
  • అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించ‌డం జ‌గ‌న్ విజ్ఞ‌త‌కే వ‌దిలేద్దాం

అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించ‌డం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజ్ఞ‌త‌కే వ‌దిలేద్దామ‌ని ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. పోల‌వ‌రంతో పాటు ప‌లు ప్రాజెక్టుల‌పైన, అలాగే అసెంబ్లీ స‌మావేశాల‌పైన అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు నాయుడు చ‌ర్చించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఇడుపులపాయ‌లో పాద‌యాత్ర మొద‌లుపెట్టిన సంద‌ర్భంగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు.

వ్య‌క్తిగ‌తంగా తిట్ట‌డం మ‌న సంప్రదాయం కాదని అన్నారు. ఇడుపులపాయ‌లో ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి జ‌గ‌న్‌కి క‌నిపిచండం లేదా? అని ప్ర‌శ్నించారు. అలాగే అసెంబ్లీలో స‌భ్యులు హుందాత‌నంగా న‌డుచుకోవాలని సూచించారు. మంత్రులు త‌మ శాఖ‌ల ద్వారా ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌ను అసెంబ్లీలో వివ‌రించాలని సూచించారు.  

More Telugu News