lovers: ప్రియుడితోనే ఉంటానన్న భార్య.. తన లక్ష రూపాయలూ ఇమ్మన్న భర్త.. సెటిల్ చేసిన పోలీసులు!

  • చదువుకుంటూ ప్రేమలో పడిన యువతి
  • ప్రేమ సంగతి తెలిసి మేనమామతో వివాహం జరిపించిన తల్లిదండ్రులు
  • భర్తను కాదని రెండు సార్లు ప్రియుడితో పారిపోయిన యువతి
  • పోలీసుల కౌన్సిలింగ్ తో 25,000 రూపాయలు అడ్వాన్స్ చెల్లించిన ప్రియుడు

25,000 రూపాయలు అడ్వాన్స్ చెల్లించి ప్రియురాలిని దక్కించుకున్నాడో ప్రియుడు. తమిళనాడులో చోటుచేసుకున్న చిత్రమైన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... తిరుచ్చి జిల్లా మనప్పారై ప్రాంతానికి చెందిన దేవి (24) చదువుకునే రోజుల్లో ఒక యువకుడిని ప్రేమించింది. ఇది తెలియడంతో, మేనమామతో ఆమెకు తల్లిదండ్రులు బలవంతంగా వివాహం జరిపించారు. ఇష్టంలేని వివాహం జరిపించడంతో కొన్నాళ్లకు దేవి ప్రియుడితో పారిపోయింది. దీంతో ఆమెను వెతికి తెచ్చి ఎంతగా నచ్చచెప్పినప్పటికీ, రెండోసారి కూడా ఆమె పారిపోయింది.

దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆమెను గుర్తించి తీసుకొచ్చి భర్తకు అప్పగించారు. ఇంటికి చేరిన ఆమె తన మేనమామతో కాపురం చేయనని స్పష్టం చేసింది. వివాహానంతరం ఆమెను ఎంఈ చదవించేందుకు లక్ష ఖర్చుచేశానని. తన డబ్బు తనకిచ్చి తన నుంచి విడిపోవాలని భర్త దేవికి స్పష్టం చేశాడు. దీంతో రెండు రోజుల పాటు ముగ్గురికీ కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసుల చర్చలతో వారంతా ఒక అంగీకారానికి వచ్చారు. లక్ష రూపాయలు చెల్లిస్తానని చెప్పి, అడ్వాన్స్ గా 25,000 రూపాయలు చెల్లించి దేవిని తనతో కాపురానికి ప్రియుడు తీసుకెళ్లాడు. దీంతో వివాదం సమసిపోయింది.

More Telugu News