భూటాన్ యువరాజుకి ప్రధాని మోదీ ఏం బహుమతి ఇచ్చారో తెలుసా?
- ఫిఫా అండర్-17 వరల్డ్కప్లో ఉపయోగించిన ఫుట్బాల్
- ఇంకా ఒక చదరంగం సెట్ను కూడా
- ట్విట్టర్లో ఫొటోలు
ఇటీవల భారత్లో జరిగిన ఫిఫా అండర్-17 వరల్డ్కప్లో ఉపయోగించిన అధికారిక ఫుట్బాల్, ఒక చదరంగం సెట్ను కూడా ప్రధాని కానుకగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోదీ తన ట్విట్టర్లో పంచుకున్నారు. అలాగే భూటాన్ రాజకుటుంబాన్ని కలవడం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్లతో వాంగ్చుక్ కుటుంబం సమావేశమైనట్లు సమాచారం.