cricket anchor: వైఫై పాస్ వర్డ్ కావాలని సురేష్ రైనాను అడిగిన యాంకర్ మయాంతి... చురకలేస్తున్న నెటిజన్లు!

  • క్రికెట్ మ్యాచ్ లకు వ్యాఖ్యాతగా వ్యవహరించే మయాంతి
  • కాన్పూర్ వచ్చిన వేళ వైఫై కోసం రైనాకు అభ్యర్థన
  • అంత ఖర్మ ఎందుకని నెటిజన్ల అక్షింతలు

మయాంతి లాంగర్ తెలుసుగా? భారత క్రికెట్ జట్టు ఆడే మ్యాచ్ లు చూసేవారికి చాలా సుపరిచితమైన పేరే. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటుంది. ఇప్పుడు ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ లకు కూడా యాంకరింగ్ చేస్తోంది. ఇప్పుడీమె ప్రస్తావన ఎందుకంటే, కాన్పూర్ లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కోసం వచ్చిన మయాంతి, తన ఫోన్ కు వైఫై కోసం సురేష్ రైనాను పాస్ వర్డ్ అడిగింది. భారత జట్టులో స్థానం పొందలేకపోయిన సురేష్ రైనా కాన్పూర్ లో ఏం చేస్తున్నాడని సందేహమా? కాన్పూర్ లోనే రంజీ మ్యాచ్ లు జరుగుతుండగా, యూపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రైనా అక్కడున్నాడు లెండి.

ఇక కాన్పూర్ వచ్చిన మయాంతి, తన ఫోన్ వైఫై కనెక్షన్ ఆన్ చేయగా, అందులో సురేష్ రైనా వైఫై కనిపించింది. వెంటనే దాని స్క్రీన్ షాట్ తీసి రైనాకు పంపుతూ, పాస్ వర్డ్ చెప్పాలని కోరింది. ఇక రైనా ఆ పాస్ వర్డ్ ఏంటన్నది చెప్పాడో చెప్పలేదోగానీ, నెటిజన్లు మాత్రం నీకు ఇంత ఖర్మేంటని చురకలు అంటించారు. ఫోన్ లో డేటా అయిపోతుందని ఈ కక్కుర్తేంటని క్లాస్ పీకారు.

More Telugu News