maheshbabu: రాజమౌళి .. మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!

  • మహేశ్ 25వ మూవీ వంశీ పైడిపల్లితో 
  • ఆ తరువాత త్రివిక్రమ్ తో సెట్స్ పైకి
  • బోయపాటితోను ఓ సినిమా 
  • ఆ తరువాత ప్రాజెక్టు రాజమౌళితోనే  

ప్రస్తుతం మహేశ్ బాబు .. కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఆ తరువాత మహేశ్ తన 25వ సినిమా కోసం వంశీ పైడిపల్లితో సెట్స్ పైకి వెళతాడు. ఈ సినిమా 2018 చివర్లో విడుదలవుతుంది. ఆ సమయంలోనే త్రివిక్రమ్ తో మహేశ్ మూవీ షూటింగ్ మొదలై, 2019 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఆ వెంటనే బోయపాటితో మహేశ్ చేసే మూవీ 2019 చివరిలోనే విడుదలవుతుంది. 2019 వ సంవత్సరం చివరిలో రాజమౌళి - మహేశ్ కాంబినేషన్లో సినిమా మొదలవుతుంది. ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకువస్తుంది. రాజమౌళి - మహేశ్ కాంబినేషన్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన పనిలేదు. ఈ క్రేజీ  కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడెప్పుడా అనే ఆసక్తితో వున్నవాళ్లు, అప్పటివరకూ వెయిట్ చేయవలసిందే.      

More Telugu News