radhe maa: ఆగ్ర‌హంతో ఊగిపోయిన‌ స్వయం ప్రకటిత దైవస్వరూపిణి రాధేమా!

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సంభాల్‌లో కల్కిమహోత్సవ్‌లో పాల్గొన్న రాధేమా
  • ప‌లు అంశాల‌పై ప్ర‌శ్నించిన మీడియా
  • నోరు మూయండంటూ వ్యాఖ్యానించిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు

ఇటీవలి కాలంలో వివాదాల్లో ఇరుక్కుంటున్న ఆధ్యాత్మిక గురువు రాధేమాకు కోపం ముంచుకొచ్చింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సంభాల్‌లో కల్కిమహోత్సవ్‌లో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడింది. విలేక‌రులు ఆమెను ప‌లు అంశాల‌పై ప్ర‌శ్నించ‌గా, తాను కూర్చున్న‌ సీట్లోంచి ఒక్కసారిగా లేచి, త‌న‌పై ఎలాంటి ఆరోపణలు లేవని ఆగ్ర‌హంతో చెప్పింది.

అసలు ఇటువంటి ప్రశ్నలు త‌న‌నెందుకు అడుగుతున్నారని ప్ర‌శ్నించింది. మీ నోళ్లు ముయ్యండని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆమె పక్కనున్న శిష్యులు ఆమెను శాంతింప‌జేసి మ‌ళ్లీ సీట్లో కూర్చోబెట్టారు. రాధేమాపై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అధికారి సీట్లో కూర్చోవటం, ఆమె శిష్యుల్లో ఒకరి కోడలిపై వరకట్నం వేధింపుల కేసుల్లో ఈవిడ ప్రమేయం ఉండ‌డం వంటి ఆరోప‌ణ‌ల‌తో ఆమె చిక్కుల్లో ప‌డ్డారు.

More Telugu News