KE Krishnamurthy: ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు మ‌మ్మ‌ల్ని క‌లిశారు.. మా పార్టీలో చేర‌తారు: కేఈ కృష్ణ‌మూర్తి

  • ఈ ఏడాది చివ‌ర్లోగా మ‌రి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేర‌తారు
  • వారి కోసం త‌లుపులు తెరిచే ఉన్నాయి
  • జ‌గ‌న్‌ పార్టీకి భ‌విష్య‌త్తు లేదు
  • ఎన్ని పాద‌యాత్ర‌లు చేసినా ప్ర‌జ‌లు ఆయ‌న‌ను న‌మ్మ‌బోరు

ఈ ఏడాది చివ‌ర్లోగా మ‌రి కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు త‌మ పార్టీలో చేర‌తార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, టీడీపీ నేత కేఈ కృష్ణ మూర్తి అన్నారు. ఈ రోజు క‌ర్నూలులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే త‌మ‌ను కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు సంప్ర‌దించార‌ని చెప్పారు. ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి చేరాల‌నుకునే వారి కోసం త‌లుపులు తెరిచే ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్‌ పార్టీకి భ‌విష్య‌త్తు లేద‌ని అన్నారు. జ‌గ‌న్ ఎన్ని పాద‌యాత్ర‌లు చేసినా ప్ర‌జ‌లు ఆయ‌న‌ను న‌మ్మ‌బోర‌ని అన్నారు. అసెంబ్లీ స‌మావేశాలను బ‌హిష్క‌రించాల‌ని వైసీపీ అనుకోవ‌డం బాధ్య‌తారాహిత్య‌మ‌ని చెప్పారు.

More Telugu News