mallika dua: మోదీని అనుక‌రించ‌వ‌ద్ద‌న్నారు... రాహుల్ గాంధీని అనుక‌రించ‌మ‌న్నారు: టీవీ షోపై క‌మెడియ‌న్ శ్యామ్ రంగీలా

  • సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన క‌మెడియ‌న్‌
  • వివాదాస్ప‌దం అవుతున్న `ద గ్రేట్ ఇండియ‌న్ లాఫ్ట‌ర్ ఛాలెంజ్‌`
  • ఇప్ప‌టికే అక్ష‌య్ కుమార్ మీద ఆరోప‌ణ‌లు చేసిన సాటి జ‌డ్జి మ‌ల్లికా దువా

స్టార్ ప్ల‌స్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న `ద గ్రేట్ ఇండియ‌న్ లాఫ్ట‌ర్ ఛాలెంజ్‌` కార్య‌క్ర‌మం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇప్ప‌టికే అందులో జూనియ‌ర్ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించే తనతో సూప‌ర్ జ‌డ్జి అక్ష‌య్ కుమార్ త‌ప్పుగా మాట్లాడాడ‌ని మ‌ల్లికా దువా ఓ వీడియో ద్వారా వెల్ల‌డించారు.

ఇక అదే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కంటెస్టెంట్ క‌మెడియ‌న్ శ్యామ్ రంగీలా కూడా కార్య‌క్ర‌మం నిర్వహ‌ణ గురించి కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ప్ర‌ధాని మోదీని అనుక‌రించ‌వ‌ద్ద‌ని నిర్వాహకులు చెప్పార‌ని, రాహుల్ గాంధీని అనుక‌రించ‌డానికి మాత్రం ఒప్పుకున్నార‌ని తెలిపాడు. మ‌ళ్లీ త‌ర్వాత రాహుల్ గాంధీని కూడా అనుక‌రించ‌కూడ‌ద‌ని చెప్పడంతో తాను సాధార‌ణంగా త‌న గొంతుతోనే జోకులు చెప్ప‌డంతో అవి పెద్ద‌గా పేల‌లేద‌ని వ్యాఖ్యానించాడు. దీంతో తాను ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు.

మ‌రోప‌క్క మ‌ల్లికాను అక్ష‌య్ త‌ప్పుగా సంబోధించ‌డంపై అక్ష‌య్ మీద ఆరోప‌ణ‌లు చేస్తూ ఆమె తండ్రి వినోద్ దువా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టి, త‌ర్వాత కాసేప‌టికి డిలీట్ చేశాడు. మ‌ల్లిక కూడా త‌న వీడియోను డిలీట్ చేసింది. కార్య‌క్ర‌మం ప్ర‌సారం చేసేట‌పుడు కూడా అక్ష‌య్ మాట‌ల‌ను ఎడిట్ చేయ‌డంతో అక్ష‌య్ అన్న మాట‌ల గురించి పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు. అయితే జాతీయ మీడియా ప్ర‌సారం చేసిన క‌థ‌నాల మేరకు ఏదో సంద‌ర్భంలో `మ‌ల్లికా నువ్వు గంట మోగిస్తే... నేను నిన్ను మోగిస్తా` అని అక్ష‌య్ అన్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News