fifa: ఫిఫా అండ‌ర్-17 ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కి గంగూలీ, స‌చిన్‌

  • చివ‌రి అంకానికి చేరుకున్న ఫిఫా అండ‌ర్‌-17 ప్ర‌పంచ‌క‌ప్‌
  • అక్టోబ‌ర్ 28న జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌
  • త‌ల‌ప‌డ‌నున్న ఇంగ్లండ్ - స్పెయిన్ దేశాలు

భార‌త‌దేశంలో మొద‌టిసారి జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ టోర్న‌మెంట్ ఫిఫా అండ‌ర్‌-17 ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ చివ‌రి అంకానికి చేరుకుంది. అక్టోబ‌ర్ 28, శ‌నివారం నాడు ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కోల్‌క‌తాలో జ‌ర‌గ‌నుంది. ఇంగ్లండ్ - స్పెయిన్ దేశాల జ‌ట్ల‌ మ‌ధ్య జ‌రగ‌నున్న ఈ ఫైన‌ల్ మ్యాచ్‌కి భార‌త దేశ మాజీ క్రికెట‌ర్లు సౌర‌వ్ గంగూలీ, స‌చిన్ టెండూల్క‌ర్‌లు హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచుల్లో బ్రెజిల్‌పై ఇంగ్లాండ్‌, మాలిపై స్పెయిన్‌ విజయం సాధించి ఫైన‌ల్‌కి చేరుకున్నాయి. ఈ ఫైన‌ల్ మ్యాచ్ కోసం పశ్చిమ బెంగాల్ చేస్తున్న ఏర్పాట్లు తుదిస్థాయికి చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు ఫిఫా అధ్యక్షుడు జియానో ఇన్‌ఫాంటినో హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News