గుజరాత్ లో తిష్ఠ వేసిన ఉగ్రవాదులను చాకచక్యంగా బంధించిన ఏటీఎస్!
- డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు
- అడ్డుకునే వ్యూహంతో దాడులకు ప్లాన్
- భగ్నం చేసిన ఏటీఎస్ పోలీసులు
ఎన్నికలను అడ్డుకోవడమే వీరి ప్రధాన ఉద్దేశమని ప్రాథమిక విచారణలో తేలినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 9న 19 జిల్లాల్లోని 89 స్థానాల్లో తొలిదశలోను, ఆపై మిగిలిన 14 జిల్లాల్లోని 93 స్థానాల్లో డిసెంబర్ 14న రెండో దశలోను ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికల కోసం నవంబర్ 20న నోటిఫికేషన్ జారీ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్ తో పాటు గుజరాత్ ఓట్లను డిసెంబర్ 18న లెక్కిస్తారు. 1998 నుంచి గుజరాత్ లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ, ఈ దఫా కూడా విజయం సాధించాలన్న కృత నిశ్చయంతో ఉండగా, అధికారం తమకే దక్కుతుందని కాంగ్రెస్ ఆశగా ఉంది.