pavan kalyan: బల్గేరియాకి బయల్దేరుతోన్న 'అజ్ఞాతవాసి' టీమ్

  • ముగింపు దశకు చేరుకున్న 'అజ్ఞాతవాసి' 
  • బల్గేరియాలో చివరి షెడ్యూల్ 
  • రెండు పాటలు .. కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • జనవరి 9న విడుదల

పవన్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి' సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగును బల్గేరియాలోని వివిధ లొకేషన్లలో ప్లాన్ చేశారు. అక్కడికి వెళ్లడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. మూడు వారాల పాటు అక్కడ షూటింగ్ జరపనున్నారు.

 రెండు పాటలతో పాటు ఛేజింగ్ సీన్స్ .. ఫైట్స్ ను కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 17 నాటికి ఈ షెడ్యూల్ ను పూర్తి చేసి .. పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో కథానాయికలుగా అలరించనున్నారు. వచ్చేనెల 7వ తేదీన త్రివిక్రమ్ పుట్టినరోజు కనుక, ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్టులుక్ వదలనున్నారనే ప్రచారం జరుగుతోంది.    

More Telugu News