బాలకృష్ణ : బాలయ్య కొత్త సినిమా పేరు ఖరారు!

  • బాల‌య్య‌ 102వ సినిమాకి ‘జై సింహా’ టైటిల్‌ ఖ‌రారు
  • మొదట ‘కర్ణ’ పేరును పరిశీలించిన సినీ యూనిట్
  • నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లు 

‘గౌత‌మి పుత్ర శాతక‌ర్ణి’ సినిమాతో 100 చిత్రాలు పూర్తి చేసుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ ఆ త‌రువాత ‘పైసావసూల్‌’ సినిమాలోనూ న‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తన 102వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జై సింహా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలిసింది.

మొద‌ట ఈ సినిమాకి ‘కర్ణ’ అనే టైటిల్‌ను పెట్టాల‌ని అనుకున్నారు. అయితే, గతంలో బాల‌య్య న‌టించిన స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు, సింహా సినిమాలు ఎంత‌గా హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ సినిమా పేర్ల‌లో ‘సింహా’ అనే ప‌దం ఉంది. ఆ సెంటిమెంట్‌నే ఫాలో అవుతూ ఈ చిత్రానికి ‘జై సింహా’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఈ విష‌యాన్ని ఆ చిత్రం బృందం త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్లడించ‌నుంది. చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలుగా న‌టిస్తున్నారు. 

More Telugu News