revant reddy: రేవంత్ తో పాటు కాంగ్రెస్ లోకి జంప్ చేయనున్న బ్యాచ్ ఇదే!

  • మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు కూడా
  • రేవంత్ వెంటే బోడ జనార్దన్, సోయం బాపూరావు
  • అసెంబ్లీ సీట్లు ఖాయం చేసుకుంటున్న నేతలు
  • కాంగ్రెస్ కు కొత్త ఊపిరి ఖాయమంటున్న విశ్లేషకులు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయనున్నారని వార్తలు వస్తున్న వేళ, ఆయన వెంట కాంగ్రెస్ లో చేరనున్న వారి పేర్లు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల నేతలు రేవంత్ ను అనుసరించనున్నారని, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని వారిలోనూ పరువురు రేవంత్ వెంటే నడవనున్నారని తెలుస్తోంది.

మంచిర్యాల టీడీపీ అధ్యక్షుడు బోడ జనార్దన్, ఆదిలాబాద్ అధ్యక్షుడు సోయం బాపూరావుల కాంగ్రెస్ చేరిక ఖాయమైనట్టు తెలుస్తుండగా, నిర్మల్, కొమరం భీం జిల్లాల అధ్యక్షులు శ్యామ్ సుందర్, జి.ఆనంద్ లు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఉత్తర తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలైన జి.బుచ్చిలింగం, ఆనంద్, కోరిపల్లి భూషణ్ రెడ్డి, ప్రకాష్ లడ్డా తదితరులు ఎటువైపు వెళతారన్నది తేలాల్సి వుంది.

కాగా, రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి చేరే వారంతా తదుపరి ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటును ఖరారు చేసుకున్న తరువాతనే పార్టీ మార్పుమీద ఓ నిర్ణయానికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా, రేవంత్ తీసుకున్న నిర్ణయానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చావు దెబ్బపడినట్టేనని, కాంగ్రెస్ కు కొత్త ఊపిరి లభించినట్టని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News