telangana bjp: తెలంగాణ బీజేపీ నేతల అత్యవసర భేటీ.. రేవంత్, నాగంలపై చర్చ!

  • మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చ
  • రేవంత్, నాగంల గురించి ప్రధాన చర్చ
  • సమావేశానికి కీలక నేతలు హాజరు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో నేడు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే విషయంపై చర్చించారు. 

More Telugu News