pavan: కర్ణాటకలో ఫైట్స్ చేసేస్తోన్న పవన్ కల్యాణ్!

  • పవన్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి' 
  • పవన్ కెరియర్లో 25వ సినిమా
  • కథానాయికలుగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ 
  • జనవరి10వ తేదీన ప్రేక్షకుల ముందుకు  

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా 'అజ్ఞాతవాసి' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటక - చిక్ మగుళూరు ప్రాంతంలో జరుగుతోంది. సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే యాక్షన్ సీన్ ను పవన్ తదితరులపై చిత్రీకరిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఈ ఫైట్స్ ను త్రివిక్రమ్ డిజైన్ చేయించినట్టు సమాచారం.

 ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చేస్తుండగా పవన్ చేతికి గాయమైనా ఆయన లెక్కచేయకుండా షూటింగులో పాల్గొంటున్నాడని అంటున్నారు. ఇది పవన్ కి 25వ సినిమా .. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో రానున్న మూడవ సినిమా. అందువలన త్రివిక్రమ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను విదేశాలలో ప్లాన్ చేశారు. కథానాయికలుగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.      

More Telugu News