Anushka: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు 'భాగమతి'
  • రెండేళ్ల తర్వాత వస్తున్న స్వాతి 
  • 'ఏ మంత్రం వేసావె' అంటున్న విజయ్ దేవరకొండ 
  • వచ్చే నెలలో 'ఒక్కడు మిగిలాడు' వచ్చేస్తున్నాడు!  

*  అనుష్క ప్రధాన పాత్రధారిగా అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భాగమతి' చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తికాగా, గత కొన్నాళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన గ్రాఫిక్స్ పని జరుగుతోంది. దీనిని వచ్చే నెలాఖరు కల్లా పూర్తి చేసి డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  
*  రెండేళ్ల గ్యాప్ తర్వాత స్వాతి మళ్లీ 'లండన్ బాబులు' అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో మారుతి నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 10న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఇందులో నూతన నటుడు రక్షిత్ హీరోగా నటించాడు.
*  'అర్జున్ రెడ్డి' హిట్ తో బిజీ అయిపోయిన విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రానికి 'ఏ మంత్రం వేసావె' అనే టైటిల్ని నిర్ణయించారు. నూతన దర్శకుడు శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాని కథానాయికగా నటిస్తోంది.
*  మంచు మనోజ్ నటించిన 'ఒక్కడు మిగిలాడు' చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. చివరికి తాజాగా పక్కా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. నవంబర్ 10న దీనిని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.        

More Telugu News