deepavali: పాకిస్థానీల‌కు విదేశాంగ మంత్రి దీపావ‌ళి గిఫ్ట్‌

  • అర్హులైన వారంద‌రికీ మెడిక‌ల్ వీసాలు
  • పెండింగ్‌లో ఉన్న వీసాల‌ను అనుమ‌తించిన సుష్మా స్వ‌రాజ్‌
  • ట్వీట్‌లో పేర్కొన్న కేంద్ర మంత్రి

దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా పాకిస్థానీయుల‌కు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ మంచి బ‌హుమ‌తిని ఇచ్చారు. భార‌త దేశంలో ఆరోగ్య చికిత్స‌ల కోసం అర్జీ పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న అర్హులైన వారంద‌రికీ మెడిక‌ల్ వీసాలు జారీ చేస్తున్నట్లు ఆమె వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని ఆమె ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఇటీవ‌ల కంటి కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఓ చిన్నారికి, ఎముక మూలుగు (బోన్ మారో) మార్పిడి చికిత్స అవ‌స‌ర‌మైన ఓ వ్య‌క్తికి, కాలేయ చికిత్స అవ‌స‌ర‌మైన మ‌రో ఇద్ద‌రికి మెడిక‌ల్ వీసాలు జారీ చేయాల‌ని పాకిస్థాన్‌లోని భార‌త హై క‌మిష‌న్‌ను ఆమె ఆదేశించారు. అంతేకాకుండా ట్విట్ట‌ర్ ద్వారా ఆమె దృష్టికి వ‌చ్చిన అన్ని ర‌కాల మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీలకు ఆమె వీసా జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News