maheshbabu: మహేశ్ బాబుతో 'లీడర్' సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న శేఖర్ కమ్ముల!

  • 'ఫిదా'తో భారీ హిట్ కొట్టేసిన శేఖర్ కమ్ముల 
  • 'లీడర్' కి సీక్వెల్ చేసే ఆలోచన
  • పొలిటికల్ డ్రామా నేపథ్యంపై పెరిగిన నమ్మకం 
  • కథను సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు

శేఖర్ కమ్ముల గతంలో రానాను తెరకు పరిచయం చేస్తూ 'లీడర్' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదుగానీ, ఒక వర్గం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలోనే శేఖర్ కమ్ముల వున్నాడు. త్వరలో ఆయన ఆ ఆలోచనను ఆచరణలో పెట్టనున్నట్టు తెలుస్తోంది.

మహేశ్ బాబుతో 'లీడర్' సీక్వెల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కథను సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఇటీవల వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' హిట్ కొట్టేసింది. మరో వైపున రాజకీయాల నేపథ్యంలోనే కొరటాల సినిమా 'భరత్ అను నేను' తెరకెక్కుతోంది. అందువలన 'లీడర్' సీక్వెల్ కి ఇది సరైన సమయంగా శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. అయితే కొరటాల మూవీలో ముఖ్యమంత్రిగా చేస్తోన్న మహేశ్ బాబు, మళ్లీ అదే తరహా లైన్ కి ఓకే చెబుతాడా? అనేదే డౌటు.     

More Telugu News