palani swamy: వీరిద్దరూ డెంగ్యూ దోమలకన్నా ద్రోహులు: డీఎంకే పత్రిక మురసోలి

  • పళనిస్వామి, పన్నీర్ లు ద్రోహులు
  • తమిళనాడులో ప్రబలిన డెంగ్యూ
  • విమర్శలు గుప్పించుకుంటున్న అన్నాడీఎంకే, డీఎంకే

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలపై డీఎంకే అధికార పత్రిక మురసోలి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజల రక్తం తాగడంలో వీరిద్దరూ డెంగ్యూ దోమలను మించిపోయారని... వీరిద్దరూ ద్రోహులని విమర్శించింది. ఈ మేరకు ఓ కార్టూన్ ను ప్రచురించింది. తమిళనాడులో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ప్రబలింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే, డీఎంకేలు ఈ అంశంపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. డీఎంకే పార్టీ డెంగ్యూ వ్యాధిలాంటిదని, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటూ మంత్రి సెల్లు రాజా విమర్శించారు. మరోవైపు ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ ను 'డెంగ్యూ భాస్కర్'గా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభివర్ణించారు.

More Telugu News