pavankalyan: 'అజ్ఞాతవాసి' ఫస్టులుక్ దీపావళికి లేనట్టే!

  • త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి'
  • ఫస్టులుక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు 
  • కీర్తి సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు 
  • సంక్రాంతికి భారీ రిలీజ్          

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి దసరాకి ఫస్టులుక్ ను వదులుతారేమోనని అభిమానులు ఎదురుచూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇక టైటిల్ ఖరారైంది గనుక .. దీపావళికి ఫస్టులుక్ ను రిలీజ్ చేయడం ఖాయమని భావించారు. ఆ రోజు కోసం ఆత్రుతగా .. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే దీపావళికి కూడా ఫస్టులుక్ ను రిలీజ్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ లేరన్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. మరికొంత సమయం తీసుకుని .. మంచి సందర్భం చూసుకుని ఆయన ఈ సినిమా ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.         

More Telugu News