rajasekhar: బాలయ్య చేతుల మీదుగా 'గరుడ వేగ' ట్రైలర్ రిలీజ్!

  • రాజశేఖర్ హీరోగా రూపొందిన 'గరుడ వేగ'
  • కథానాయికగా పూజా కుమార్ 
  • సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ హైలైట్
  • వచ్చేనెల 3న విడుదల       

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'గరుడ వేగ' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి రేపు (మంగళవారం) రాత్రి 8 గంటలకు ట్రైలర్ ను వదలనున్నారు. హైదరాబాద్ - జూబ్లీహిల్స్ లోని ఆర్కే సినీ ప్లెక్స్ లో బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.

 ఈ కారణంగా ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుందనే నమ్మకంతో వున్నారు. ఇప్పటికే వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరగడం ఖాయమని భావిస్తున్నారు. రాజశేఖర్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇందులో పూజా కుమార్ కథానాయికగా నటించగా, శ్రద్ధా దాస్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ కానుందని సమాచారం.      

More Telugu News