కొత్త పార్టీతో రాజకీయాల్లోకి వస్తున్న నాటి డీఎస్పీ!
- 2014లో కూడ్లిగి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనుపమ షణై
- మంత్రితో విభేదించి, ఎదరించిన అనుపమ
- 2016లో డీఎస్పీ పదవికి రాజీనామా
ఇప్పుడు మౌనాన్ని వీడి, తాజాగా కల్బుర్గిలో తన అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహిళా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను రాజకీయ పార్టీ స్థాపించబోతున్నానని ఆమె ప్రకటించారు. దానికి మహిళల మద్దతు అవసరమని ఆమె కోరారు. రాజకీయ పార్టీలన్నీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తాయి కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలన్నీ మోసం చేస్తున్నాయని అన్నారు. తమ పార్టీలో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని ఆమె స్పష్టం చేశారు. కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 అసెంబ్లీ సీట్లు మహిళలకు కేటాయిస్తానని ఆమె ప్రకటించారు. ఎక్కడైతే ఆమె పదవిని వదిలేశారో..అదే కుడ్లిగిలో నవంబర్ 1న బహిరంగ సభ ఏర్పాటు చేసి, పార్టీ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.